పంచాయతీ ఫలితాలపై స్పందించిన హరికృష్ణ

గురువారం, 1 ఆగస్టు 2013 (13:11 IST)
File
FILE
ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించారని, ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీదే విజయంగా తెలుస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్క రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. మూడు దశల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కట్టబెట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సరళిని చూస్తుంటే ప్రజలు తమ పార్టీ వైపు ఉన్నాలని ఎవరికైనా అర్థమవుతోందన్నారు.

వెబ్దునియా పై చదవండి