పాతబస్తీలో కర్ఫ్యూను మరింత సడలిస్తాం: రోశయ్య

ఆదివారం, 4 ఏప్రియల్ 2010 (14:35 IST)
పాతబస్తీలోని పరిస్థితి ప్రస్తుతం కుదుటపడుతోందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలోని పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు. సోమవారం అక్కడ మరింత కర్ఫ్యూ సడలించమని తాము పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

ఈ సందర్భంగా ఆయన నగరంలోని పాత జైలు స్థలంలో విశాఖపట్టణం అర్బన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ(వుడా) ఏర్పాటు చేయనున్న పార్కుకు ఈ రోజు సాయంత్రనాలుగు గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు.

వెబ్దునియా పై చదవండి