పురంధేశ్వరి : ఎన్నిచట్టాలు తీసుకువచ్చినా నేటికి వేధింపులు తగ్గలేదు!

FILE
బ్రూణహత్యలు, బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస నిరోధానికి ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా నేటికీ వేధింపులు తగ్గడం లేదని కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు పూర్తి స్థాయిలో ఆర్ధిక స్వేచ్ఛ లభించిననాడే వివక్ష తొలగిపోయే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు.

మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన కోవే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి పురంధేశ్వరి పైవిధంగా వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి