ప్రచారంలో మాత్రమే కాంగ్రెస్ అభివృద్ధి: బాబు

గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మాత్రమే అభివృద్ధి కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. స్వప్రయోజనాలకోసం భూములను అన్యాక్రాంతం చేస్తూన్న వైఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తెల్ల రేషన్‌ కార్డులను ఇష్టానుసారం జారీ చేస్తున్న ప్రభుత్వం ఆ కార్డులకు బియ్యాన్ని మాత్రం పంపిణీ చేయడంలేదంటూ పేర్కొన్నారు. అలాగే రిజర్వేషన్ల శాతాన్ని పునర్‌వ్యవస్థీకరించకుండానే ప్రభుత్వం కొన్ని బీసీ కులాలను డి నుంచి ఏకు మార్చిందంటూ ఆయన విమర్శించారు.

తన పాలనలో రాష్ట్రం వెలిగిపోతోందంటూ చెబుతున్న వైఎస్ బియ్యం ధరలు ఎందుకు కొండెక్కాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. టీడీపీ తరపున ప్రచారం చేస్తున్న బాలకృష్ణపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టడం కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగానే ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల సందర్భంగా తమ ఎన్నికల ప్రణాళికలో ఓ విన్నూత్న పథకాన్ని చేర్చనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి