ప్రారంభమైన బాలయ్య నెల్లూరు పర్యటన

తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నెల్లూరు జిల్లా పర్యటన ఆదివారం ప్రారంభమైంది తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడ నుంచి ఆయన జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. పర్యటన ప్రారంభానికి ముందు తడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై బాలకృష్ణ ప్రశంసల జల్లు కురిపించారు.

నగదు బదిలీ పథకానికి జనంలో అద్భుతమై స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా నేతృత్వంలోని మహాకూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలావుండగా, బాలయ్య పర్యటనకు జిల్లాకు చెందిన పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇదిలావుండగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటన సందర్భంగా బాలకృష్ణకు అభిమానుల నుంచి ముప్పు పొంచి వుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో తనకు భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జానారెడ్డికి బాలకృష్ణ వినతిపత్రం సమర్పించారు.

వెబ్దునియా పై చదవండి