ప్రేమ వివాహం: భార్యను వదిలి కొత్తపెళ్లికొడుకు పరార్!

మంగళవారం, 21 జనవరి 2014 (11:58 IST)
FILE
వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి రెండు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ అంతలోనే తన తల్లిదండ్రులను చూడాలనుందని చెప్పి కొత్త పెళ్లికొడుకు పరారయ్యాడు. దీంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని అమీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా వున్నాయి.....

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కన్నీరు రాజు, అల్మాస్గూడకు చెందిన లక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అల్మాస్గూడలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. అయితే రాజు తనకు తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని, చూసి వస్తానని భార్య లక్ష్మికి చెప్పి ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లాడు.

అంతే తర్వాత అతడి సమాచారం వస్తే ఒట్టు. దాంతో రాజు భార్య ఆందోళన చెంది, భర్త ఆచూకీ కోసం ప్రయత్నించింది. అయినా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి