బడి పంతుళ్ళ బదిలీలకు హైకోర్టు పచ్చజెండా

మంగళవారం, 4 ఆగస్టు 2009 (13:50 IST)
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతంలో విధించిన స్టే కారణంగా బ్రేక్ బడిన బదిలీల ప్రక్రియ మళ్లీ ఆరంభంకానుంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ఉన్న అడ్డంకుల్నీ తొలగిపోయినట్టేనని టీచర్ల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

టీచర్ల బదిలీలను నిలిపి వేస్తూ ట్రిబ్యునల్‌ గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వాదోపవాదనలు విన్న అనంతరం హైకోర్టు టీచర్ల బదిలీలకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు పట్ల ఉపాధ్యాయ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

వెబ్దునియా పై చదవండి