బాబును తిట్టి సోనియా వద్ద డబ్బులు గుంజుతున్న కేసీఆర్!

గురువారం, 8 మార్చి 2012 (20:09 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకవైపు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తిట్టి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద కేసీఆర్ డబ్బులు గుంజుతున్నారని ఆయన ఆరోపించారు.

తెరాస స్థాపించి 11 యేళ్లు గడిచిన కేసీఆర్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. అందుకే కేసీఆర్‌కు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. ఇది గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

పగలుకు, రాత్రికీ తేడా తెలియకుండా పీకల వరకు మద్యం సేవించే కేసీఆర్... తాగిన మత్తులో తాను ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు. తాగుబోతు కేసీఆర్ ఏ క్షణంలో ఏం మాట్లాడుతారో తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే ఆయన మాటను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.

ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టి సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం కేసీఆర్ ఇప్పటికైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ కోసం కేసీఆర్ గతంలో చేసిన ఆమరణ నిరాహారదీక్ష ఓ భూటకమన్నారు. సకల జనుల సమ్మెను కేసీఆర్ సకల సంపదగా మార్చుకున్నారని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి