బాబు ఆస్తి కేసు: మరో బెంచ్కి బదిలీ అయిన వెకేట్ పిటిషన్లు!
శుక్రవారం, 9 డిశెంబరు 2011 (12:27 IST)
చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణను హైకోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దాఖలైన వెకేట్ పిటిషన్లు జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ నుంచి మరో బెంచ్కు బదిలీ అయ్యాయి. అయితే చంద్రబాబు వెకేట్ పిటిషన్ విచారణ మరో బెంచ్కు బదిలీ కావడంపై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సుప్రీం ఆదేశాలు అలాగే ఉన్నాయని, పిటిషన్లను మరో బెంచ్కు బదిలీ చేయొద్దని న్యాయవాది అన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్కు అప్పగించడంపై జగన్ తరపు న్యాయవాది అన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించిన బెంచీయే వెకేట్ పిటిషన్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ ముందుకు వెకేట్ పిటిషన్లు వచ్చేలా చంద్రబాబునాయుడు ఓ పథకం ప్రకారం వ్యవహరించారని సుశీల్ కుమార్ తన వాదనలు వినిపించారు. కాగా.. చంద్రబాబు తదితరుల అనుబంధ పిటిషన్లు ఏ బెంచ్ విచారించాలనేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుంది.