బొత్స ప్రకటన .. జోగి రమేష్ కామెంట్స్ : తోట నరసింహం జవాబు

సోమవారం, 4 ఫిబ్రవరి 2013 (13:25 IST)
File
FILE
కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనపై రెబెల్ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన విమర్శలను రాష్ట్ర మంత్రి తోట నర్సింహం ఖండించారు.

పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని ధిక్కరించే వారిపై చర్య తీసుకునే అధికారం బొత్సకు ఉందని సమాధానం ఇచ్చారు. పైపెచ్చు.. 9 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం బొత్స తీసుకున్న ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని, పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరణ ఇచ్చారు.

నేతలెవరైనా పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరిని అధికారికంగా బహిష్కరించ లేదన్నారు. 2014 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంత్రి తోట నరసింహం జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి