బొత్స సత్యనారాయణ : మా ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం!

శనివారం, 10 ఆగస్టు 2013 (18:25 IST)
File
FILE
తాము కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేతలుగా ఉన్నప్పటికీ... తమతమ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యకు ముందుగానే పరిష్కారం చూపించాలన్నారు.

శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌లను బొత్స సత్యనారాయణ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తాను ముఖ్యమంత్రి పాటుపడుతున్నట్టు చెప్పారు.

విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అధిష్టానానికి తాము ధైర్యంగా చెప్పామని, ఆ తర్వాత మిగిలిన పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతలు స్పందించారని చెప్పుకొచ్చారు. ఆంటోనీ కమిటీ ఎవరెవరూ మాట్లాడాలో, ఏయే అంశాలపై మాట్లాడాలో తాను ముఖ్యమంత్రి కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

వెబ్దునియా పై చదవండి