రహేజా స్కామ్‌లో ముగ్గురు మంత్రులు : శంకర్రావు ఆరోపణ

సోమవారం, 10 సెప్టెంబరు 2012 (14:09 IST)
File
FILE
రహేజా సంస్థకు భూముల కేటాయింపు కుంభకోణంలో ముగ్గురు మంత్రుల హస్తముందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.శంకర్రావు ఆరోపించారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ రహేజా సంస్థకు భూములు కేటాయింపులో సుమారుగా రూ.5 వేల కోట్ల మేరకు అవినీతి చోటు చేసుకుందని చెప్పారు.

ఈ స్కామ్‌లో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ప్రమేయముందని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ త్వరలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసిన గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్టు తెలిపారు.

రాష్ట్ర హోం మంత్రి పీఠం నుంచి సబితా ఇంద్రా రెడ్డిని తక్షణం తొలగిస్తే.. ఆమె అధికారాన్ని అడ్డుపెక్టుటుకుని చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని శంకర్రావు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి