రాష్ట్రం పచ్చనోట్ల పరిశ్రమగా మారింది: చిరు

ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం పచ్చనోట్ల పరిశ్రమగా మారిపోయిందని ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు చిరంజీవి ధ్వజమెత్తారు. దేశంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగినా నిధులు ఇక్కడ నుంచి వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అక్షయ పాత్రలాగా కనిపిస్తోందని, ఆ పార్టీకి రాష్ట్ర పచ్చనోట్ల పరిశ్రమ అని తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రం నుంచి భారీగా నిధులు వెళుతుండటంతో, ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హైకమాండ్‌గా మారారన్నారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా డబ్బులు సమకూర్చుకుంటున్నారని ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో చిరంజీవి విరుచుకుపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా చిరు ఈ ఆరోపణలు చేశారు.

వెబ్దునియా పై చదవండి