రెండు బస్సులు ఢీ : 20మందికి గాయాలు

శనివారం, 4 అక్టోబరు 2008 (11:48 IST)
ఖమ్మం జిల్లా నాయుడుపేటలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. అర్టీసీ డ్రైవరు ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును చూసుకోకుండా నడపడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు అంటున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని 108 ప్రభుత్వ ఆంబులెన్సు ద్వారా సమీపంలోని నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆర్టీసీ డ్రైవరు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి