వరద ప్రాంతాల్లో ఆ ముగ్గురు పర్యటించాలి!: చంద్రబాబు

FILE
రాష్ట్రంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పర్యటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.

భారీ వర్షాలకు, వరదలకు పంటల్ని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.5వేలు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం అయిదు నియోజకవర్గాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించనున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలన్నారు. అలాగే రబీ సీజన్‌కు సబ్సిడీపీఐ విత్తనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతుల ఇబ్బందులు తొలగాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలన్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన రైతులకు తమ వంతు సహాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి