విజయశాంతి: కేసీఆర్‌తో వార్.. మెదక్ సీటు ఏమైనా చాక్లెట్టా?

FILE
మెదక్ ఎంపీ సీటుపై సిట్టింగ్ ఎంపీ విజయశాంతి, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఇందులోభాగంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అడిగిన వెంటనే మెదక్ సీటు ఇచ్చేందుకు అదేమైనా చాక్లెట్టా అని ప్రశ్నించారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లోనూ తాను మెదక్ నుంచే పోటీ చేస్తానని ఈ రాములమ్మ ప్రకటించారు.

ఆమె ఒక ప్రైవేట్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కేసీఆర్ అడిగితే ఇవ్వటానికి మెదక్ ఎంపీ సీటు చాక్లెట్ కాదన్నారు. మెదక్ నా ఊపిరి తెలంగాణ నా ప్రాణం అని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సీటు వ్యవహారంపై కేసీఆర్‌తో కూడా తాను మాట్లాడబోనని ప్రకటించారు.

ఇకపోతే ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ సెటిల్‌మెంట్లపై ఆమె స్పందిస్తూ ఇలాంటి ఆరోపణల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్‌పై మాత్రం నిరవధికంగా వస్తున్న ఆరోపణలపై పార్టీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ సెటిల్‌మెంట్ల వ్యవహారం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి