వేటు వేయాలనే అవిశ్వాసానికి మద్దతు: "పిల్లి" వ్యాఖ్య

శనివారం, 10 డిశెంబరు 2011 (16:28 IST)
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడే తమపై అనర్హత వేటు వేస్తారని తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గం సభ్యుడు, మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

తమందరిపై ఒకేసారి వేటు వేస్తే అంతా కలిసి ఉపఎన్నికలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇందుకోసమే తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అనర్హత వేటు వేసిన తర్వాత జరుగబోయే ఎన్నికలు 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివని పిల్లి సుభాష్ అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి