వైఎస్సార్ - కేసీఆర్‌లే తెలంగాణాను అడ్డుకున్నారు: జి.వి

శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు ముగుస్తుండటంతో నేతలంతా తమ తమ నివేదికలతో కమిటీ ముందు క్యూ కట్టారు. ఈ రోజు కమిటీకి నివేదికలను అందించినవారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి కూడా ఉన్నారు. నివేదిక సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణా రాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి, కె. చంద్రశేఖర రావులు మోకాలడ్డారని విమర్శించారు. గతంలో రాష్ట్ర ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్లద్దరూ పూర్తిగా తెలంగాణా రాకుండా అడ్డుపడ్డారని అన్నారు.

ఇక ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో బయటకు వచ్చిన మరో నాయకుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణా ఏర్పాటు అంశంపై మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శించారు. తను సమర్పించిన నివేదికలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్నంతా కళ్లకు కట్టినట్లుగా వివరించానన్నారు.

వెబ్దునియా పై చదవండి