గాంధీ భవన్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫోటోను తొలగించడాన్ని సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తప్పుపట్టడాన్ని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ వైఎస్కు కేవీపీ మరోసారి తన కృతజ్ఞత, విశ్వాసం, విధేయత చూపారని వ్యాఖ్యానించారు.
ఆయన ఆ విధంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ వైఎస్వో, జగన్వో, ఆయన తాతవో కాదన్నారు. వాటిని మార్పులు చేసుకుంటామని, వైఎస్ పథకాలు నీరుగారుస్తున్నారని ఆరోపించే హక్కు జగన్ పార్టీకి లేదా, ఇతర పార్టీలకు లేదని పాల్వాయి పునరుద్ఘాటించారు.