షబ్బీర్ ఆలీ : టి నోట్ సిద్ధం.. త్వరలో శాసనసభకు...

సోమవారం, 9 సెప్టెంబరు 2013 (10:08 IST)
File
FILE
తెలంగాణ నోట్ సిద్ధమైందని, త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి వస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీఎన్జీఓల సభలో సభా వేదికపై పలువురు నాయకులు ఫోటోలు పెట్టుకున్నవారు హైదరాబాద్ నగరానికి పునాది వేసిన నాయకులను ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం, కుతుబ్ షాహీలను ఏపీఎన్జీఓలు ఎలా మరిచిపోతారని నిలదీశారు.

ఇకపోతే.. హైదరాబాద్‌ కేంద్రంగా సభలెన్ని పెట్టుకున్నా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని షబ్బీర్ జోస్యం చెప్పారు. వారం రోజుల్లో కేబినేట్ నోట్ ప్రవేశపెడుతారని, ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రానికి తాము సూచించామని మీడియా సమావేశంలో వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి