సికింద్రాబాద్ సీటు మినహా తెలంగాణలో బీజేపీ ఎక్కడా గెలువదు!

FILE
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక్క సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. ఆ ఒక్క సీటు మినహా తెలంగాణలో మరెక్కడా బిజెపి గెలువదన్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని మసులుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా 13 ఏళ్ల క్రితం తెరాస ఆవిర్భవించినందువల్లనే నాగంతో పాటు టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు ప్రత్యేక రాష్ట్ర జపం చేస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణపై ఆ మూడు పార్టీలు చేసే ప్రయత్నాలకు తెలంగాణ ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారని రాములమ్మ అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి