సీఎం కిరణ్ వ్యాఖ్యలకు డీఎస్ కౌంటర్ అటాక్: నిర్ణయం నచ్చకుంటే?

FILE
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. కిరణ్ వ్యాఖ్యలపై డీఎస్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నీ విషయాలపై అవగాహన చేసుకున్నాకే తెలంగాణపై నిర్ణయం ప్రకటించారన్నారు.

తెలంగాణ ఉద్యమాల్లో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఐదు దశాబ్ధాలుగా తెలంగాణ ఉద్యమాన్ని గమనిస్తోందని డీఎస్ గుర్తు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం సరిగ్గా జరిగివుంటే తెలంగాణకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణలో అనేక సహజ సిద్ధ వనరులున్నాయని డీఎస్ వెల్లడించారు.

ఉద్యమంలో వందలాది యువకులు ఆత్మబలిదానం చేశారని డీఎస్ తెలిపారు. ఇలాంటి తరుణంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే పార్టీ వేదికపైనే లేవనెత్తాలని డీఎస్ చెప్పారు.

నదీ జలాలన్నీ అంతరాష్ట్రాలతోనే ముడిపడివున్నాయని, నదీ జలాల పంపిణీకి శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారముందని డీఎస్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి