సీఎం పదవి కోసం పాకులాడుతున్న జగన్: చిరంజీవి ధ్వజం

ఆదివారం, 10 జూన్ 2012 (14:39 IST)
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడుతున్నాడని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రస్ పార్టీకి ఓటేస్తే అవినీతికి కొమ్ముకాసినట్లేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

అక్రమ సంపాదన కాపాడుకునేందుకు సీఎం పదవి కోసం పాకులాడుతున్నాడని ప్రజలు ఇది గమనించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నెల్లూరు ఉప ఎన్నికల్లో చిరు పిలుపు నిచ్చారు. దివంగత నేత వైఎస్సార్ మరణాన్ని కూడా జగన్ రాజకీయం చేయడం సిగ్గుచేటని చిరంజీవి దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి