హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి దొంగల ప్లాన్.. పోలీసులు కాల్పులు!

శనివారం, 5 ఏప్రియల్ 2014 (16:40 IST)
FILE
దోపిడీ దొంగలు ఇపుడు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతోన్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సవం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు చోరీ యత్నానికి పాల్పడ్డారు. కానీ వీరి ప్రయత్నాన్ని పోలీసులు విఫలయత్నం చేశారు.

హుబ్లీ నుంచి మైసూర్ వెళ్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్ అనంతపురంలోని గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వేస్టేషన్ దాటిన అనంతరం అప్పటికే రైల్లో ఉన్న ఓ దొంగ చైన్ లాగి రైలును ఆపాడు. ఆ సమయంలో రైలు ఆగిన ప్రాంతంలో ఉన్న దోపిడీ దొంగలు కిటికీల నుంచి మహిళల ఒంటిపై ఆభరణాలను లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. భయంతో దొంగలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆభరణాలు చోరీకి గురికాలేదు.

వెబ్దునియా పై చదవండి