హరీష్ రావు వార్నింగ్ : ప్రక్రియ ఆగితే అగ్నిగుండమే

గురువారం, 8 ఆగస్టు 2013 (11:11 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగితే ఈ ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని టీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. సీమాంధ్రుల లాబీయింగ్, ఆందోళనలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన ప్రక్రియను ఆపినట్టయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రకటించారు.

ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మెత్తబడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భస్మీపటలమవుతుందన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించిన తెలంగాణను అడ్డుకున్న రీతిలో ఈసారి నోటికాడి ముద్దను లాక్కుంటే సహించబోమన్నారు.

వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్ తదితరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి