హలో కేసీఆర్‌ గారు.. చచ్చి సాధించేదేముంది: నన్నపనేని

సోమవారం, 9 నవంబరు 2009 (10:52 IST)
తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అయిన నన్నపనేని రాజకుమారి ఒక ఉచిత సలహా ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణత్యాగం (ఆమరణ నిరాహారదీక్ష) చేయాలని భావించడం పట్ల నన్నపనేనికి తెగ బాధపడి పోతున్నారు.

చచ్చిసాధించేది ఏముందని ఆమె ప్రశ్నించారు. అందువల్ల ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను విరమించుకోవాలని ఆమె సూచించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యక్ష ఎన్నికలే శరణ్యమని గతంలో ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం ఆ ఎన్నికలకు దూరం కావడం విచిత్రంగా ఉందన్నారు.

ఇకపోతే.. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ అధిక స్థానాలు దక్కించుకుని తీరుతుందని ఆమె జోస్యం చెప్పారు. అధికార కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలే తమ విజయానికి బాటలుగా నన్నపనేని రాజకుమారి చెప్పుకున్నారు.

వెబ్దునియా పై చదవండి