హైకోర్టు వద్ద టెన్షన్ : సీమాంధ్ర లాయర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

శుక్రవారం, 6 సెప్టెంబరు 2013 (13:29 IST)
FILE
హైకోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులు ఘర్షణ దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ బంద్, శాంతి ర్యాలీ నేపథ్యంలో కోర్టు వద్ద ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు.

ఈ క్రమంలో సీమాంధ్ర న్యాయవాదులు న్యాయస్థానం వద్ద మానవహారం చేపట్టబోగా తెలంగాణ న్యాయవాదులు వ్యతిరేకించారు. దాంతో, బార్ కౌన్సిల్ వద్ద నినాదాలు చేశారు.

అటు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో సీమాంధ్ర లాయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ, సమైక్య నినాదాలతో హైకోర్టు ప్రాంగణం దద్ధరిల్లింది. దౌర్జన్యంగా పోలీసులు అరెస్ట్ చేశారంటూ సీమాంధ్ర లాయర్లు ఆందోళన చేశారు. అలాగే కొందరు తెలంగాణ లాయర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి