హైదరాబాద్‌పై 3 ప్రతిపాదనలు : హోంమంత్రి షిండే

శనివారం, 7 సెప్టెంబరు 2013 (18:05 IST)
FILE
తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతోందని కేంద్ర హోంశాఖా మంత్రి షిండే తెలిపారు. ఢిల్లీలో సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం నోట్ తయారు చేస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌పై మూడు ప్రతిపాదనలు ఉన్నాయని, ఏదో ఒక నిర్ణయాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. అయితే విభజనపై అప్పుడే అన్ని విషయాలు చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా తెలంగాణపై కేంద్ర మంత్రులు షిండే, దిగ్విజయ్ ఏదో ఒక ప్రకటన చేస్తుంటే.. మరోవైపు సమైక్య ఉద్యమం 40 రోజులకు దగ్గరవుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియం సమైక్య నినాదాలతో దద్ధరిల్లింది.

వెబ్దునియా పై చదవండి