హైదరాబాద్ లేని తెలంగాణ మాకెందుకు: కొండా సురేఖ

మంగళవారం, 4 అక్టోబరు 2011 (17:15 IST)
హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. రాయల తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు.

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తమకు కావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.

తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు లేదని కొండా సురేఖ అన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే సమర్పించిన తమ రాజీనామాలను దమ్ముంటే ఆమోదించాలని బొత్సకు ఆమె సవాల్ విసిరారు.

అలాగే జగన్మోహన్ రెడ్డి వర్గానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజీనామా లేఖలు బొత్స వద్ద ఉన్నాయని వాటిపై ఆయన తొలుత ఆమోదముద్ర వేయాలని సురేఖ డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి