12 నుంచి పార్లమెంటుకెళ్దాం.. 20 నుంచి లొల్లి చేద్దాం.. కేసీఆర్

శుక్రవారం, 10 ఆగస్టు 2012 (17:30 IST)
FILE
తెలంగాణ వచ్చేస్తుందంటూ తెలంగాణ ప్రాంత సభల్లో చెపుతున్న కేసీఆర్, ఒకవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా జాడే లేకుండా పోయింది. ఆగస్టులో ప్రళయం అంటున్న కేసీఆర్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.

ఐతే కేసీఆర్ మాత్రం తాను ఏం చేసినా, ఎప్పుడు చేసినా ఒక పద్ధతి ప్రకారం ఉంటుందనీ, ఆగస్టు 12 తర్వాత నుంచి పార్లమెంటుకు హాజరు కావాలనుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. 12 నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణపై లొల్లి చేసి ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చేసి 20 నుంచి ఉద్యమ బాట పట్టాలని ఆయన నిర్ణయించినట్లు చెపుతున్నారు.

మరోవైపు తెలంగాణ రాగాన్ని అందుకున్న టి.కాంగ్రెస్ ఎంపీలను సైలెంట్ మోడ్ లోకి తీసుకెళ్లారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ సమయంలో కేసీఆర్ పార్లమెంటులో ప్రవేశిస్తే ఏదయినా ఫలితం ఉంటుందంటున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారో వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి