వివాహేతర సంబంధం... ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య... బాపట్లలో పురుగుల మందు తాగి...

శనివారం, 25 ఏప్రియల్ 2015 (18:22 IST)
గుంటూరు జిల్లాలో బాపట్ల పట్టణం పరిధిలో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు, బాపట్ల మండలానికి చెందిన ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు ఝాన్సీతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఐతే శ్రీనుకు భార్యాపిల్లలు ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమోకానీ మాచర్లలో ఇద్దరూ శవాలై తేలారు. ఈ ఆత్మహత్య శుక్రవారంనాడే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమేనని పోలీసులు భావిస్తున్నార. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి