టీఆర్ఎస్‌లో వలసల వెల్లువ: జంపింగ్ జపాంగ్..

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (13:34 IST)
టీఆర్ఎస్‌లో వలసల వెల్లువ పెరిగిపోతోంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారెక్కే నేతల సంఖ్య అధికమవుతోంది. ఒకరి తర్వాత మరొకరుగా కారు ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌, వైసీపీలకు చెందిన మరికొందరు నేతలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. 
 
ఇల్లెందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా వైసీపీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, డాక్టర్‌ రాజేశ్వరరావు, వెంకటరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

వెబ్దునియా పై చదవండి