మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం స్కామ్ (మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు)లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయింది 34 మంది మాత్రమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ స్కామ్లో పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధం ఉండి మృత్యువాత పడినవారు దాదాపు 47 వరకు ఉందని మీడియాలో ప్రచారం సాగుతోంది.