ఏపీలో 70 శాతం ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు : కేఏ పాల్

గురువారం, 4 మే 2023 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల్లో 70 శాతం మంది తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ప్రస్తుత వైకాపా పాలనలో ఆదాయం పెరగలేదుగానీ అప్పులు బాగా పెరిగిపోయాయని అన్నారు. మంత్రి బొత్సకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని తెలిపారు. అందువల్ల ఆయన ఆస్తులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితో ఏపీని ముంగేస్తాడని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని ఆయన ప్రశ్నించారు. త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తానని చెప్పారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. వైకాపాలోని అవినీతిపరులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు