9నే మున్సిపల్ పోలింగ్ ఫలితాలు వెల్లడి : హైకోర్టు

మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (16:06 IST)
File
FILE
ఈనెల 9వ తేదీనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫలితాలను వెల్లడించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9న కౌంటింగ్‌తో పాటు అదే రోజున ఫలితాలు కూడా వెల్లడించాలని ప్రకటించింది.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ చెప్పిన వాదనను పరిశీలించకుండా ఉండలేమని పేర్కొంది. ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిషన్లు అసంబద్దమని కోర్టు చెప్పింది. కొన్ని రోజుల నుంచి మున్సిపల్ ఫలితాలపై న్యాయస్థానంలో వాదనలు జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. తీర్పు వెలువరించడంతో మంగళవారంతో ఈ ఫలితాల వెల్లడిపై ఉన్న ఉత్కంఠత వీడిపోయింది.

వెబ్దునియా పై చదవండి