హైదారాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తొమ్మిది నెలల పసిపాపను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్, రేణుక దంపతుల కుమార్తె కావ్య. పాపకు అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తీసువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాపను శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.