విశాఖపట్టణంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే, ఈ విద్యార్థిని హత్య చేశారా.. లేక ఆత్మహత్యనా అనే అనే అంశంపై కలకలం రేగుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... విశాఖపట్నానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక తనూజ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిండ్రులు అర్థరాత్రి దాకా వెదికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు తనూజ కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ వెనుక భాగంలోని చెత్త కుప్పల్లో విగత జీవిగా పడి ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తనూజతో సన్నిహితంగా మెలగుతున్న దిలీప్ అనే బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.