ప్రేమికుడికిచ్చి పెళ్లి చేయలేదని యువతి సూసైడ్

మంగళవారం, 22 మార్చి 2016 (17:13 IST)
చిత్తూరు జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. తన ప్రేమ వ్యవహారంపై తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో ఒక యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బి.డి.కండ్రిగ మండలం కళ్లివేటు హరిజనవాడకు చెందిన చందన్‌కుమార్‌, వాణిల కుమార్తె గౌరి గత కొన్నిరోజులుగా రమేష్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. 
 
గౌరి ప్రేమ వ్యవహారం తెలిసిన తల్లిదండ్రులు గౌరిని మందలిస్తూ వచ్చారు. అయితే తాను ప్రేమిస్తున్న వ్యక్తిని తనకు ఇచ్చి వివాహం చేయమని తల్లిదండ్రలను గౌరి కోరింది. దీంతో తల్లిదండ్రులు గౌరిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన గౌరి మంగళవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి వాణి కుమార్తె గౌరిని చూసి కన్నీంటి పర్యంతమైంది. గౌరి మరణంలో కళ్ళివేటు హరిజనవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి