తిరుమల ఘాట్‌రోడ్డులో జీపు బోల్తా - ముగ్గురి పరిస్థితి విషమం

గురువారం, 5 మే 2016 (18:26 IST)
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని 18వ మలుపు వద్ద జీపు లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై వెళుతున్న వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను లోయలో నుంచి బయటకు తీసి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులు ఖమ్మం జిల్లా కొత్తూరు తాండాకు చెందిన భీముడు, మణి, లక్ష్మీమోహన్‌, రంగిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి