మస్తాన్ వలి తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని నీతూ తెలిపింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకోవాలని అతడు తనను వేధించాడని కూడా తెలిపింది. అతడి వేధింపులు తట్టుకోలేక అతడికి లొంగిపోయానని, ఆ క్రమంలోనే ఈ రొంపిలోకి దిగాల్సి వచ్చిందని వెల్లడించింది. మస్తాన్ వలితో సంబంధాలు ఏర్పడ్డ తర్వాత నీతూ, తన కుటుంబానికి దూరమైంది.
తాజాగా ఎర్రచందనం కేసులో నీతూ అరెస్టైన విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కర్నూలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, మస్తాన్ వలి అరెస్ట్ కావడం, స్మగ్లింగ్లో తన ప్రమేయం ఉందని బయటపడటంతో నీతూ పోలీసులకు లొంగిపోవాలని యత్నించిందట. ఈ మేరకు ఆమె మధ్యవర్తుల ద్వారా పోలీసులకు సమాచారం కూడా అందించింది. అయితే లొంగుబాటు యత్నాలు ఫలించకముందే ఆమె బెంగళూరు పారిపోతూ పోలీసులకు పట్టుబడింది.