భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీపై హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు. అద్వానీపై బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ఉందని, అలాంటి వ్యక్తికి పద్మ భూషణ్ ఇచ్చారన్నారు. అదే నాపై ఓ చిన్న కేసు ఉన్నా పాస్పోర్టు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు.
ఆయన సోమవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. ఒక భారతీయ పౌరుడిగా యాకూబ్ మెమన్కు న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకున్నట్టు చెప్పారు. మెమన్ స్థానంలో ఓ హిందువు ఉన్నా.. తాను ఇదే విధంగా స్పందిచేవాడినని గుర్తు చేశారు. యాకూబ్ మెమన్ ముస్లిం కావడం వల్లే ఉరిశిక్షను అమలు చేయబోతున్నారంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్న విషయంతెల్సిందే.