అద్దె ఇల్లు ఎలా ఖాళీ చేస్తారో.. అలానే చేశాం: డీజీపీ

గురువారం, 31 జులై 2014 (14:55 IST)
అద్దె ఇల్లును ఎలా ఖాళీ చేస్తారో.. తాము కూడా అలానే ఆ భవనాన్ని ఖాళీ చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్ఐబీ భవనం నుంచి కుర్చీలు, బల్లలు లూటీ చేశారనడం సరికాదని డీజీపీ రాముడు తెలిపారు. 
 
అద్దె ఇల్లును ఎలా ఖాళీ చేస్తారో... తాము కూడా అలానే ఆ భవనాన్ని ఖాళీ చేశామని డీజీపీ వెల్లడించారు. తాము తీసుకెళ్లిన ప్రతీ వస్తువు గురించి తెలంగాణ పోలీస్ అధికారులకు చెప్పామన్నారు. వాస్తవంగా సదరు భవనాన్ని గవర్నర్ ఏపీ గ్రేహౌండ్స్‌కు కేటాయించారని... అయితే తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐబీ భవనం కావాలని తమను కోరడంతో ఖాళీ చేశామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి