రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ జైలు గోడలు పిలుస్తున్నాయ్ : బుద్ధా వెంకన్న

శుక్రవారం, 10 జనవరి 2020 (12:55 IST)
'రావాలి జగన్.. కావాలి జగన్' అంటూ జైలు గోడలు పిలుస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. అక్రమాస్తుల కేసులో నాంపప్లి సీబీఐ కోర్టుకు జగన్ శుక్రవారం వ్యక్తిగతంగా హాజరైన విషయం తెల్సిందే. ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడుగా ఉన్నారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్... నేరుగా కోర్టు బోనులో నిలబడి చేతులు కట్టుకుని నిల్చొన్నారంటూ బుద్ధా వెంకన్న చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"జగన్మోహన్ రెడ్డిగారూ.. మీరు కోర్టుకు హాజరై జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్‌లో చాలా కష్టపడుతున్నారు. రూ.60 లక్షలు ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇపుడు ఖర్చు ఎంత చూపిస్తారు.? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్.. కావాలి జగన్ అని సెటైర్లు వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు