పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : అంబటి రాంబాబు విమర్శలు

ఆదివారం, 28 జూన్ 2015 (17:13 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. అదీ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజ్ఞలు చేసినపుడే ఆ పెయిడ్ ఆర్టిస్ట్ మాట్లాడుతారంటూ మండిపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల ఆధిపత్య పోరాటంపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్టుగా మారిపోయారన్నారు. 
 
తన ట్విట్టర్ ఖాతాలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసే బదులు మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటను బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు కదా అని అంబటి ప్రశ్నించారు. గవర్నరు వ్యవస్థను రద్దు చేయాలని గతంలో కోరిన టీడీపీ, ఇప్పుడు అదే గవర్నరుకు సర్వాధికారాలు ఇవ్వాలని అంటోందని అంబటి ఎద్దేవా చేశారు. 

వెబ్దునియా పై చదవండి