శివరాత్రి సందర్భంగా తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించడంతో ఈవోపై ఆనం శుభకర్ రెడ్డి చిందులు వేశాడు. నీ సంగతేమిటో తేలుస్తానంటూ ఈవో భ్రమరాంబను దూషించారు ఆనం శుభకర్ రెడ్డి. గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా... సీఎంతో మాట్లాడి నీ కథ తేలుస్తానంటూ నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు అక్కడివారు చెపుతున్నారు.