పరిటాల సునీత అనుచరులు టీడీపీ నేతల పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర బుధవారం ఉదయం తహశీల్దార్ షేక్మహబూబ్ బాషాను కలిసేందుకు వచ్చారు. తాము చెప్పినా పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ ఆయనతో వాదనకు దిగారు. నిబంధనల ప్రకారం రద్దు చేయాల్సి వచ్చిందన్న ఎమ్మార్వో సమాధానానికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక టీడీపీ నేత శ్రీనివాస్ ఎమ్మార్వోపై దాడి చేశారు.