అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రైలుకింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. తరువాత వీరి ప్రేమను పెద్దలకి తెలియజేయగా, వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని చెప్పిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు.