ఒకే సారి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తేదీ ఖరారు...!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:19 IST)
ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒకేసారి, ఒకే అసెంబ్లీ ప్రాంగణంలో జరగనున్నాయి. అందుకుగాను తేదీని ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ముందుగా వచ్చేనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్ల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నారు.
 
ఈ సమావేశంలో రెండు అసెంబ్లీ విధి విధానాలనుపై చర్చించనున్నారు. గేట్-1 నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను అనుమతించాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే గేట్-2 నుంచి రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతించాలని భావించారు. ఇలా ఇప్పటివరకు ఎప్పుడూ ఒకేసారి ఒకే సమయంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే భవనంలో జరిగిన దాఖలాలు లేవు. ఇది దేశ చరిత్రలో రికార్డుకెక్కనుంది.

వెబ్దునియా పై చదవండి