ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు రైతుల నుంచి భూసమీకరణకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. రాజధాని నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్ళూరు మండలాలలోని 17 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనున్నారు.
అలాగే, రాజధాని నిర్మాణం కోసం గ్రామాలు, వాటిలోని ఇళ్ళ జోలికి వెళ్ళబోమని స్పష్టం చేశారు. భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న కొద్దిమంది రైతులను ఒప్పించడానికి అథారిటీ కృషి చేసి, వారిని ఒప్పిస్తామని తెలిపారు.