కొత్తపల్లిలో జరిగిన బాణాసంచా పేలుడు మృతులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. ఆతర్వాత మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. కాగా, ప్రమాదం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి స్థానిక ఎమ్మార్వోను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్పలో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించిన విషయం తెల్సిందే. ఈ పేలుడులో 13 మంది మృత్యువాతపడగా, మంగళవారానికి ఈ సంఖ్య 16కు చేరిన విషయం తేల్సిందే.